News October 11, 2024
కమిటీలు ఏర్పాటు చేయాలి: గద్వాల కలెక్టర్

గ్రామపంచాయతీలు మునిసిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అడిషనల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీలలో స్వయం సహాయక గ్రూప్ మహిళలను సభ్యులుగా చేర్చాలన్నారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇండ్ల విషయంలో లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.
Similar News
News November 10, 2025
బాదేపల్లి మార్కెట్లో ధరల వివరాలు

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం మొక్కజొన్న 6,683 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,977 ధర లభించింది. వడ్లు (ఆర్ఎన్ఆర్) 1,307 క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.2,419 పలికింది. హంస రకం వడ్లకు గరిష్ఠ ధర రూ.1,858 లభించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు.
News November 10, 2025
MBNR:FREE కోచింగ్.. అప్లై చేస్కోండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. ‘జూనియర్ బ్యూటీ పార్లర్ ప్రాక్టీషనర్’లో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు. SSC MEMO, రేషన్, ఆధార్కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 12లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.
News November 10, 2025
MBNR: సాఫ్ట్బాల్.. 2nd PLACE

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


