News October 12, 2024

20 నియోజకవర్గాల్లో అక్రమాలు: జైరాం రమేశ్

image

హ‌రియాణా ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలో తాము లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌పై EC విచార‌ణ జ‌రుపుతుంద‌ని భావిస్తున్న‌ట్టు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా 20 స్థానాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు. కౌంటింగ్‌కి ఉప‌యోగించిన EVMలు, వాటి బ్యాట‌రీ సామ‌ర్థ్యాల‌పై కాంగ్రెస్ అభ్య‌ర్థులు అభ్యంత‌రాలు లేవ‌నెత్తారని, అక్ర‌మాలు జ‌రిగిన EVMల‌ను సీల్ చేయాల్సిందిగా ఆయ‌న కోరారు.

Similar News

News October 12, 2024

ఒక్కో కుటుంబంపై అప్పు ఎంతంటే?

image

TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. జాతీయ సగటు రూ.90,372గా ఉంది. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92శాతానికి పెరిగింది. ఇందులో జాతీయ సగటు 52%. ఇక దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తొలి 2 రాష్ట్రాలు TG(92%), AP(86%) కావడం గమనార్హం. మరోవైపు ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే 3.8 నుంచి 4.1కి పెరిగింది.

News October 12, 2024

దసరా రోజున రావణుడికి పూజ.. ఎక్కడో తెలుసా?

image

సాధారణంగా అన్ని చోట్ల విజయ దశమి రోజున రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. యూపీలోని కాన్పూర్‌లో మాత్రం రావణుడిని పూజిస్తారు. ఇక్కడ దశకంఠుడికి ఆలయం ఉంది. దసరా రోజునే తెల్లవారుజామునే దీనిని తెరుస్తారు. వేలాది మంది భక్తులు గుడికి వచ్చి రావణుడిని పండితుడిగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని సాయంత్రం కల్లా మూసివేస్తారు.

News October 12, 2024

ఉప్పల్‌లో క్లీన్ స్వీప్ చేస్తారా?

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా, క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది. మరోవైపు ఒక్క మ్యాచులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ ఆరాటపడుతోంది. మరి పండగ రోజు యువ భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.