News October 12, 2024

‘డిగ్రీ’లో అడ్మిషన్లు అంతంతమాత్రమే

image

TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.

Similar News

News October 12, 2024

కమలా హారిస్‌కు ఏఆర్ రెహమాన్ మద్దతు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె కోసం 30 నిమిషాల సంగీత ప్రదర్శన వీడియోను రేపు విడుదల చేయనున్నారు. దక్షిణాసియా నుంచి హారిస్‌కు మద్దతునిచ్చిన తొలి కళాకారుడు ఆయనే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరఫున హారిస్ పోటీ పడుతున్నారు.

News October 12, 2024

సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహినూర్’

image

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహీనూర్’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సిద్దూ గెటప్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై పార్ట్-1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

News October 12, 2024

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. మండలం మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మ.ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.