News October 12, 2024

సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహినూర్’

image

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహీనూర్’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సిద్దూ గెటప్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై పార్ట్-1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Similar News

News October 12, 2024

17న కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

image

హ‌రియాణాలో BJP ప్ర‌భుత్వం Oct 17న కొలువుదీర‌నుంది. పంచ‌కుల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో నాయబ్ సింగ్ సైనీ మ‌రోసారి CMగా ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. ఆయ‌న‌తోపాటు నూత‌న మంత్రివ‌ర్గ స‌భ్యులు కూడా ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌ధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. కొత్త స‌భ్యుల‌కు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ద‌క్క‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

News October 12, 2024

జామ్‌నగర్ సింహాసనానికి వారసుడిగా జడేజా

image

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సంస్థాన మహారాజు శత్రుశల్య సిన్హ్‌జీ దిగ్విజయ్ సిన్హ్‌జీ జడేజా తమ వారసుడిగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించారు. తమ వారసుడిగా ఉండేందుకు అజయ్ అంగీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. జడేజా 1992-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. అనంతరం కొన్ని సినిమాల్లోనూ నటించారు. గత ఏడాది వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా కూడా పనిచేశారు.

News October 12, 2024

ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే పాఠాలు నేర్చుకుంటారు?: రాహుల్ గాంధీ

image

మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసింది. లెక్కలేనన్ని ప్రమాదాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోవడం లేదు. జవాబుదారీతనం అనేది పైనుంచే మొదలవుతుంది. ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే ఈ సర్కారు కళ్లు తెరుస్తుంది?’ అని మండిపడ్డారు.