News October 12, 2024
ఉమ్మడి జిల్లాలో 6,426 దరఖాస్తులు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొత్త షాప్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణలో కిక్కు ఎక్కించే ఉమ్మడి జిల్లాలో ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 205 షాప్లకి 6,426 దరఖాస్తులు దాఖలు రాగా రూ.128.52 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో పార్వతీపురంలో 52 షాప్లకు 1,376 దరఖాస్తులకు రూ.27.52 కోట్లు ఆదాయం వచ్చింది. విజయనగరం జిల్లాలో 153 షాప్లకి 5,050 దరఖాస్తులు రాగా రూ.101 కోట్లు ఆదాయం వచ్చింది.
Similar News
News October 1, 2025
VZM: పీ4 కార్యక్రమంపై చంద్రబాబు ఏమన్నారంటే..!

పీ4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తెస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దత్తిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఆయన ప్రశాంగించారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. ప్రజల బాగోగుల కోసం నిర్దిష్టమైన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
News October 1, 2025
చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తా: దత్తిలో సీఎం

సంక్షేమమే కాదు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని CM చంద్రబాబు పేర్కొన్నారు. దత్తిలో ఆయన మాట్లాడారు. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే తను పనిచేస్తానన్నారు. ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని, రహదారులను కూడా బాగు చేస్తున్నామని అన్నారు.
News October 1, 2025
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం: సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని, 2026 ఆగస్టుకు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు.