News October 12, 2024
దసరా ఎఫెక్ట్.. జోరుగా మద్యం విక్రయాలు

దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత 5 రోజుల్లో విక్రయాలు 25శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా. సగటున రూ.1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈనెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు తరలింది. ఇక ఈనెల 1 నుంచి 8 వరకు మొత్తం రూ.852.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
Similar News
News January 25, 2026
NGKL: ఐద్వా జాతీయ సభలకు తరలి వెళ్లిన మహిళలు

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలకు ఆ సంఘం నాయకులు, మహిళలు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఆదివారం తరలి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో సమావేశానికి వెళ్లారు. ఈ సమావేశాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ సమావేశాల్లో దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని ఐద్వా సంఘం నాయకులు తెలిపారు.
News January 25, 2026
తగ్గనున్న BMW, ఫ్రెంచ్ వైన్ ధరలు?

భారత్-EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న జరిగే India-EU సమ్మిట్లో ఒప్పందం ఖరారు లాంఛనంగా కనిపిస్తోంది. అదే జరిగితే BMW, ఫోక్స్వ్యాగన్ వంటి ప్రీమియం కార్లు, ఫ్రెంచ్ వైన్ సహా అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇండియా నుంచి టెక్స్టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో EU మార్కెట్ భారత్కు కీలకం కానుంది.
News January 25, 2026
T20 WC.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయంటే?

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూపులను ICC ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ గ్రూప్-Aలో ఉన్నాయి. బంగ్లాదేశ్ WC నుంచి తప్పుకోవడంతో గ్రూప్-Cలో దాని స్థానంలో స్కాట్లాండ్ను చేర్చారు. పై ఫొటోలో ఏ గ్రూపుల్లో ఏ జట్లు ఉన్నాయో చూడొచ్చు.


