News October 13, 2024
జైలులో నాటకం.. సీతను వెతుకుతూ ఖైదీల పరార్

ఉత్తరాఖండ్లోని రోషనాబాద్ జైలులో నాటకమాడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడపై నుంచి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Similar News
News January 26, 2026
కడప జిల్లాలో నేటి PGRS రద్దు: SP.!

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఈనెల 26వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నందున ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు గమనించి, దూర ప్రాంతాల నుంచి రాకూడదని ఆయన కోరారు. తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు.
News January 26, 2026
నేటి ముఖ్యాంశాలు

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్పై మూడో T20Iలో భారత్ విజయం
News January 26, 2026
T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

న్యూజిలాండ్తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.


