News October 13, 2024
WC.. ఇవాళ భారత్ VS ఆసీస్
మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ALL THE BEST INDIA
Similar News
News October 13, 2024
హీరోయిన్తో టాలీవుడ్ హీరో ఎంగేజ్మెంట్(PHOTOS)
తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్లో AP సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, MLA బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆమె వేలికి ఉంగరం తొడిగారు. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అటు డిసెంబర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
News October 13, 2024
సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు
చెన్నై శివారులో భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA విచారణ ప్రారంభించింది. మెయిన్ లైన్లో ఉండాల్సిందిగా సిగ్నల్ ఇచ్చినా రైలు లూప్లైన్లోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విషయంలో దర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
News October 13, 2024
రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్
ఉత్తరాఖండ్ రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని దుండగులు ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్ కలకలం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేషన్ల మధ్య ఉదయం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్పై సిలిండర్ను గుర్తించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘటనా స్థలానికి పాయింట్స్మెన్ చేరుకొని ఖాళీ సిలిండర్గా గుర్తించారు. ఆగస్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘటనలు చోటుచేసుకున్నాయి.