News October 13, 2024

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్‌లు ఆడి 10 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. టీమ్ ఇండియా తర్వాత పాకిస్థాన్ (8), అఫ్గానిస్థాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.

Similar News

News October 13, 2024

హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో ఎంగేజ్‌మెంట్(PHOTOS)

image

తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్‌లో AP సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, MLA బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆమె వేలికి ఉంగరం తొడిగారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అటు డిసెంబర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

News October 13, 2024

సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు

image

చెన్నై శివారులో భాగ‌మ‌తి ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA విచార‌ణ ప్రారంభించింది. మెయిన్ లైన్‌లో ఉండాల్సిందిగా సిగ్న‌ల్ ఇచ్చినా రైలు లూప్‌లైన్‌లోకి ప్ర‌వేశించ‌డం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ జ‌రిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విష‌యంలో ద‌ర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

News October 13, 2024

రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్

image

ఉత్త‌రాఖండ్‌ రూర్కీ స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఉంచిన‌ ఖాళీ గ్యాస్ సిలిండ‌ర్ క‌ల‌క‌లం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేష‌న్ల మ‌ధ్య ఉద‌యం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన లోకోపైల‌ట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘ‌ట‌నా స్థలానికి పాయింట్స్‌మెన్ చేరుకొని ఖాళీ సిలిండ‌ర్‌గా గుర్తించారు. ఆగ‌స్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.