News October 13, 2024
ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు.. విశేషాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
Similar News
News October 13, 2024
హీరోయిన్తో టాలీవుడ్ హీరో ఎంగేజ్మెంట్(PHOTOS)
తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్లో AP సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, MLA బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆమె వేలికి ఉంగరం తొడిగారు. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అటు డిసెంబర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
News October 13, 2024
సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు
చెన్నై శివారులో భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA విచారణ ప్రారంభించింది. మెయిన్ లైన్లో ఉండాల్సిందిగా సిగ్నల్ ఇచ్చినా రైలు లూప్లైన్లోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విషయంలో దర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
News October 13, 2024
రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్
ఉత్తరాఖండ్ రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని దుండగులు ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్ కలకలం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేషన్ల మధ్య ఉదయం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్పై సిలిండర్ను గుర్తించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘటనా స్థలానికి పాయింట్స్మెన్ చేరుకొని ఖాళీ సిలిండర్గా గుర్తించారు. ఆగస్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘటనలు చోటుచేసుకున్నాయి.