News October 13, 2024
ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన 34 ప్రపంచ దేశాలు
లెబనాన్లోని UN శాంతిపరిరక్షణ బలగాల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను భారత్తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశపూర్వక చర్యలుగా UNIFIL ఆరోపించింది. బలగాల రక్షణ అత్యంత ప్రాధాన్యాంశంగా భారత్ పేర్కొంది.
Similar News
News October 13, 2024
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా, రేపు బడులు తెరుచుకుంటాయి. ఇక TGలో రేపు కూడా సెలవు ఉండగా, ఎల్లుండి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలోని జూనియర్ కాలేజీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి.
News October 13, 2024
తన పుస్తకంలో మోదీ గురించి రాసుకున్న బోరిస్ జాన్సన్
UK EX-PM బోరిస్ జాన్సన్ రాసిన ‘అన్లీష్డ్’ పుస్తకంలో PM మోదీపై ప్రశంసలు కురిపించారు. దౌత్యపరంగా, వ్యక్తిగతంగా మోదీ నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. మోదీని మార్పులు తీసుకొచ్చే వ్యక్తిగా అభివర్ణించిన బోరిస్ మొదటిసారి ఆయన్ను కలిసినప్పుడు ఉత్సుకతతో కూడిన శక్తిని అనుభూతి చెందానన్నారు. భారత్తో ఘనమైన బంధాన్ని కలిగి ఉన్నామని, తన హయాంలోనే స్వేచ్ఛా వాణిజ్యానికి పునాది వేశామన్నారు.
News October 13, 2024
PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <