News October 13, 2024

బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలు మూతపడేది ఎప్పుడంటే?

image

శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. NOV 17న బద్రీనాథ్, కేదార్‌నాథ్, నవంబర్ 3న యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అలాగే రుద్రనాథ్ ప్రవేశద్వారాలు ఈ నెల 17న క్లోజ్ చేస్తారు. ఈ ఏడాది బద్రీనాథ్‌ను 11 లక్షల మంది, కేదార్‌నాథ్‌ను 13.5 లక్షల మంది దర్శించుకున్నారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి.

Similar News

News October 13, 2024

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా, రేపు బడులు తెరుచుకుంటాయి. ఇక TGలో రేపు కూడా సెలవు ఉండగా, ఎల్లుండి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలోని జూనియర్ కాలేజీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి.

News October 13, 2024

త‌న పుస్త‌కంలో మోదీ గురించి రాసుకున్న బోరిస్ జాన్స‌న్

image

UK EX-PM బోరిస్ జాన్స‌న్ రాసిన ‘అన్‌లీష్డ్’ పుస్త‌కంలో PM మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. దౌత్యపరంగా, వ్యక్తిగతంగా మోదీ నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. మోదీని మార్పులు తీసుకొచ్చే వ్యక్తిగా అభివ‌ర్ణించిన బోరిస్ మొద‌టిసారి ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడు ఉత్సుక‌త‌తో కూడిన శ‌క్తిని అనుభూతి చెందానన్నారు. భార‌త్‌తో ఘ‌న‌మైన బంధాన్ని క‌లిగి ఉన్నామ‌ని, త‌న హ‌యాంలోనే స్వేచ్ఛా వాణిజ్యానికి పునాది వేశామ‌న్నారు.

News October 13, 2024

PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.