News October 13, 2024

సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు

image

చెన్నై శివారులో భాగ‌మ‌తి ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA విచార‌ణ ప్రారంభించింది. మెయిన్ లైన్‌లో ఉండాల్సిందిగా సిగ్న‌ల్ ఇచ్చినా రైలు లూప్‌లైన్‌లోకి ప్ర‌వేశించ‌డం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ జ‌రిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విష‌యంలో ద‌ర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

Similar News

News March 10, 2025

2027 వన్డే WCకు ముందు 24 వన్డేలు

image

నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ 2027 OCT, NOVలో సౌతాఫ్రికాలో జరగనుంది. అప్పటివరకు టీమ్ ఇండియా 24 వన్డేలు ఆడనుంది. బంగ్లా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపైనే తలపడాల్సి ఉంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతారా? కామెంట్ చేయండి.

News March 10, 2025

రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది: KTR

image

TG: CM రేవంత్ అసమర్థత వల్లే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని KTR విమర్శించారు. ఇవి కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలేనని మండిపడ్డారు. ‘ఆదిలాబాద్(D) ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది’ అని ట్వీట్ చేశారు.

News March 10, 2025

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: KTR

image

TG: ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.

error: Content is protected !!