News October 13, 2024
సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు

చెన్నై శివారులో భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA విచారణ ప్రారంభించింది. మెయిన్ లైన్లో ఉండాల్సిందిగా సిగ్నల్ ఇచ్చినా రైలు లూప్లైన్లోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విషయంలో దర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
Similar News
News February 3, 2026
అందుకే ట్రంప్ మొదట అనౌన్స్ చేశారు: గోయల్

ట్రేడ్ డీల్ గురించి US అధ్యక్షుడు ట్రంప్ ముందే ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి గోయల్ క్లారిటీ ఇచ్చారు. టారిఫ్స్ తగ్గించినట్లు మొదట అమెరికానే ప్రకటించిందని అందుకే ట్రంప్ మాట్లాడారని వివరించారు. టారిఫ్స్ విధించినప్పుడు ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పారని అన్నారు. కాగా ట్రంప్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
News February 3, 2026
రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు: గోయల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ లాంటి నెగటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులు దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ పురోగతి గురించి వారికి పట్టింపు లేదన్నారు. రాహుల్ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటులో స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు. అందుకే పార్లమెంటులో మాట్లాడాల్సిన విషయం ఇక్కడ చెప్పాల్సి వచ్చిందన్నారు.
News February 3, 2026
జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

AP: మహిళపై <<18974672>>లైంగిక వేధింపుల ఆరోపణలు<<>> ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. NHRC ఆదేశాలతో ఎస్పీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంపై ఇవాళ జనసేన త్రిసభ్య కమిటీ ఆయనను <<19038842>>విచారణ<<>> చేసిన విషయం తెలిసిందే.


