News October 13, 2024
ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం

క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పనితీరు, దాని ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయనానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ దశల్లో కన్సల్టెంట్లను ఎంపిక చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే ద్వారా గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనుల ప్రభావంపై కన్సల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
Similar News
News December 28, 2025
ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ప్రెగ్నెన్సీలో మహిళలు తరచుగా నీరసంగా, అలసిపోయినట్లు కనిపిస్తారు. అయితే ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగడం మంచిది కాదందటున్నారు నిపుణులు. అలసట, తలతిరగడం, కండరాల నొప్పి, బలహీనత, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, గింజలు, రేగుపండ్లు తినాలని చెబుతున్నారు.
News December 28, 2025
మరో అడ్వెంచర్.. సబ్మెరైన్లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్కు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు. 2006లో విశాఖపట్నం నుంచి సబ్మెరైన్లో కలాం ప్రయాణించారు. కాగా గత అక్టోబర్లో <<18139196>>రఫేల్ జెట్<<>>లో, 2023లో Sukhoi 30 MKI యుద్ధ విమానంలో ముర్ము విహరించడం తెలిసిందే.
News December 28, 2025
ప్రకృతి సేద్యంలో దూసుకెళ్తున్న మహిళలు

ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడి, ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తిరుపతి జిల్లా తొట్టంబేడు(M) పెద్దకనపర్తికి చెందిన పద్మావతి, భ్రమరాంబ. వీరు సేంద్రియ సేద్యంలో వరి, పసుపు, కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. ఇంటి వద్దే ఘన, ద్రవ జీవామృతం, పంచగవ్య ఇతర ద్రావణాలు తయారుచేసి పంటకు అందించి మంచి దిగుబడులు పొందుతున్నారు. సేద్యంలో ఈ మహిళలు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


