News October 13, 2024

పూరీ ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం!

image

పూరీ జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో భ‌క్తుల‌కు ఉచితంగా మ‌హాప్ర‌సాదాన్ని పంపిణీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వ‌ల్ల ఏటా ₹14-15 కోట్ల భారం ప‌డుతుంద‌న్నారు. అయితే, ఉచితంగా ప్ర‌సాదం పంపిణీకి విరాళాలు ఇవ్వ‌డానికి కొంత మంది భ‌క్తులు ముందుకొచ్చిన‌ట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.

Similar News

News December 25, 2025

అరటి సాగుకు పిలకల ఎంపికలో జాగ్రత్తలు

image

ఆరోగ్యవంతమైన అరటి తోటల నుంచే పిలకలను ఎంపిక చేయాలి. 3 నెలల వయసు, 2 లేదా 3 కోతలు పడిన సూడి పిలకలను ఎన్నుకోవాలి. పిలకలపై చర్మాన్ని పలచగా చెక్కి లీటరు నీటికి 2.5ml మోనోక్రోటోపాస్, కాపర్ ఆక్సీక్లోరైడ్ 5గ్రా. కలిపిన ద్రావణంలో 15 ని. ముంచి నాటాలి. పొట్టి పచ్చ అరటిని 1.5X1.5 మీ. దూరంలో, గ్రాండ్ నైన్, తెల్లచక్కెరకేళిని 1.8×1.8 మీ.. మార్టిమాన్, కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంతలను 2×2 మీ. దూరంలో నాటాలి.

News December 25, 2025

198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <>www.tgprb.in<<>>లో అందుబాటులో ఉంటాయి.

News December 25, 2025

ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

image

TG: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు ₹వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని మీడియాతో చిట్‌చాట్లో వ్యాఖ్యానించారు. ‘TGకి పట్టిన శని KCR కుటుంబం. అందుకే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. నీటివాటాలలో తప్పుచేసింది కేసీఆరే. CM రేవంత్ భాష సరికాదు. KCRను తిట్టడం వెనుక సింపతీ పెంచే కుట్ర ఉంది’ అని పేర్కొన్నారు.