News October 14, 2024

నేడే మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు వచ్చిన 89,882 దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ లాటరీ తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అలాగే ఫారిన్ లిక్కర్ ఎమ్మార్పీపై చిల్లర ధర లేకుండా సర్దుబాటు చేయనుంది.

Similar News

News January 27, 2026

అప్పుడే ఎండలు మొదలయ్యాయ్

image

AP: రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం నందిగామలో గరిష్ఠంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరకోస్తాలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం గమనార్హం.

News January 27, 2026

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

image

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.

News January 27, 2026

రామకృష్ణ తీర్థం: వీరికి అనుమతి ఉండదు

image

రామకృష్ణ తీర్థానికి చేరుకోవడానికి అడవి మార్గంలో కఠినమైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే 10 ఏళ్లలోపు పిల్లలను, 50 ఏళ్లు పైబడిన పెద్దలను ఈ యాత్రకు అనుమతించరు. మార్గం సజావుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు, ఉబ్బసం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వెళ్లకపోవడం మంచిది. ఈ యాత్రలో ఎక్కువ గంటల పాటు నడవాల్సి ఉంటుంది. అందువల్ల శారీరక దృఢత్వం చాలా అవసరం. భద్రతా దృష్ట్యా ఈ నియమాలను పాటించడం క్షేమకరం.