News October 14, 2024

భోజనం చేస్తుంటే కాల్పులు జరిపారు: మావోయిస్టులు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది 31 మంది కాదని, 35 మంది అని మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ కమిటీ ప్రకటించింది. ‘ఈ నెల 4న భోజనం చేస్తుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఒకే రోజు 11 సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా, గాయపడిన వారిని మరుసటిరోజు కాల్చి చంపారు. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాం’ అని పేర్కొంది.

Similar News

News October 14, 2024

గాజా పరిస్థితులపై కమలా హారిస్ ట్వీట్

image

యుద్ధవాతావరణంతో గాజాలోని ప్రజలు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ‘దాదాపు 2 వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని UN నివేదించింది. అవసరమైన వారికి ఆహారం అందించేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2024

తమిళనాడులో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, సేలం జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరుతో పాటు మరో 15 జిల్లాలకు అక్కడి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 14, 2024

జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా..

image

AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్‌లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.