News October 14, 2024

ప్రకాశం: మద్యం మత్తులో.. బ్లేడుతో గొంతు కోసుకున్న వ్యక్తి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. శింగరాయకొండ పంచాయతీలోని కందుకూరు డ్రైవర్‌పేట వద్ద నివాసముంటున్న తన్నీరు శివ మహేశ్ శనివారం ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.

Similar News

News February 16, 2026

ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 16, 2026

మార్కాపురం: 18 ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య.!

image

మార్కాపురం జిల్లా కంభంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకు మారట్లేదు. సకల జనుల సౌభాగ్యం అని నినాదాలు వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 18 ఏళ్ల క్రితం మార్కెట్ యార్డ్ వెనుక వైపు ST/SCలకోసం నిర్మించిన మదర్ థెరిస్సా కాలనీకి ఇప్పటికి కూడా కనీసం నడవడానికి సరైన దారిలేదు. తమ హయాంలో ఎంతో చేశామని చెప్పుకునే పాలకులకు ఇలాంటివి కనపడవా? అనేది ప్రశ్న.

News February 15, 2026

సింగరాయకొండ: డ్రోన్ల నిఘాలో బీచ్ ఫెస్టివల్

image

పాకల బీచ్ ఫెస్టివల్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.