News October 14, 2024
కామన్వెల్త్ పోటీల్లో మంగళగిరి యువతికి 4 పతకాలు
ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ జూనియర్ 57 కిలోలు విభాగంలో బంగారు పతకం సాధించారు. స్క్వాట్ -185 కిలోల బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 95 కిలోల బంగారు పతకం, డెడ్లిఫ్ట్ 180 కిలోలు బంగారు పతకం, ఓవర్ల్ 460 కిలోలు బంగారు పతకం, ఓవరాల్ గా నాలుగు బంగారు పతకాలు సాధించారు.
Similar News
News October 14, 2024
అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ఉత్తర్వులు
అక్టోబరు 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
News October 14, 2024
నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కొరకు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.
News October 14, 2024
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు 12 గంటలకు సచివాలయానికి వస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తీసుకువస్తున్న పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడి విడిగా సీఎం అధికారులతో చర్చిస్తారని కార్యాలయం తెలిపింది.