News October 14, 2024

అలాంటి నాయకులను నమ్మొద్దు: అశోక్‌గజపతి రాజు

image

AP: గత ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు మండిపడ్డారు. APలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ చేశారని ఆరోపించారు. రామతీర్థ విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని దుయ్యబట్టారు. నాడు విగ్రహం కోసం నిధులు సేకరించి పంపిస్తే వెనక్కి పంపారన్నారు. ఇంట్లో ఒక మతం, బయట మరో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దని, తమ ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సవ్యంగా సాగుతోందన్నారు.

Similar News

News October 14, 2024

రెజ్యూమ్ కూడా పెట్టని యువతికి జాబ్.. CEO ఏం చెప్పారంటే!

image

ప్రస్తుత రోజుల్లో జాబ్ కొట్టడమనేది యువతకు కత్తి మీద సామే. అయితే డిఫరెంట్ అప్రోచ్, స్కిల్స్ ఉంటే కొలువు ఈజీగానే పొందవచ్చనడానికి ఈ ఘటనే నిదర్శనం. పని అనుభవం లేని, రెజ్యూమ్ కూడా పెట్టని లైబా అనే యువతికి ఓ ఏజెన్సీ CEO తస్లీమ్ జాబ్ ఇచ్చారు. తన స్కిల్స్ వివరిస్తూ లైబా క్రియేట్ చేసిన వీడియో ఆకట్టుకుందని తస్లీమ్ తెలిపారు. 800 మందిని కాదని ఆమెను సెలక్ట్ చేయగా, మంచి పనితీరుతో రాణిస్తున్నారని చెప్పారు.

News October 14, 2024

ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తీసేశారు: రకుల్

image

తాను ప్రభాస్‌తో ఓ సినిమాలో నటించానని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడంతో బాధేసిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఓ మూవీ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్ చిత్రీకరించారు. తర్వాత ఫోన్ చేయలేదు. తర్వాత నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తెలిసింది. హిట్ జోడీ కాబట్టి మేకర్స్ కాజల్‌ను తీసుకున్నారట’ అని చెప్పుకొచ్చారు.

News October 14, 2024

భారీగా పతనమైన D-Mart షేరు ధర

image

Jul-Sep క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్వెస్ట‌ర్ల‌ను మెప్పించ‌క‌పోవ‌డంతో డీమార్ట్ షేరు ధ‌ర 8% పతనమై రూ.4186 వద్ద కదులుతోంది. గ‌త ఫ‌లితాల కంటే 5% అధిక లాభంతో ₹659 కోట్ల నిక‌ర లాభాన్ని ఆర్జించినా మెప్పించలేకపోయింది. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది. బడా ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. క్విక్ కామర్స్ పోటీ కూడా డీమార్ట్ షేర్లు పడిపోవడానికి ఓ కారణమని చెబుతున్నారు.