News October 14, 2024
ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తీసేశారు: రకుల్
తాను ప్రభాస్తో ఓ సినిమాలో నటించానని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడంతో బాధేసిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఓ మూవీ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్ చిత్రీకరించారు. తర్వాత ఫోన్ చేయలేదు. తర్వాత నా స్థానంలో కాజల్ను తీసుకున్నట్లు తెలిసింది. హిట్ జోడీ కాబట్టి మేకర్స్ కాజల్ను తీసుకున్నారట’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News October 14, 2024
అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్
AP: కొత్త లిక్కర్ పాలసీతో CM చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని, లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ‘రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు. మీరు, మీ వాళ్లు డబ్బు సంపాదించుకోవడం కోసం తెచ్చిన ఈ లిక్కర్ పాలసీ ప్రమాదకరం. అక్రమార్జన కోసం ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటుకు అప్పగించారు’ అని Xలో ఆరోపించారు.
News October 14, 2024
సెప్టెంబర్లో సామాన్యుడిపై ధరల మోత
వస్తు, సేవల ధరలు ఈ ఏడాది సెప్టెంబర్లో సామాన్యుడి నడ్డివిరిచాయి. రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో గత ఏడాది Sepతో పోలిస్తే 5.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేటు 5.87% వద్ద ఉంటే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 5.05%గా నమోదైంది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ద్రవ్యోల్బణం 9.24 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు 9.08%, పట్టణాల్లో 9.56% అధికమయ్యాయి.
News October 14, 2024
బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న స్మృతీ ఇరానీ!
మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రూపాలీ గంగూలీ కీలకపాత్ర పోషిస్తున్న ‘అనుపమా’లో స్మృతీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాలు, టీవీ షోల్లో కనిపించారు. తెలుగులో ‘జై బోలో తెలంగాణ’లో ఆమె ఉద్యమకారిణి, తల్లి పాత్ర పోషించారు. అయితే ఆమె కమ్బ్యాక్ గురించి ‘అనుపమా’ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.