News October 14, 2024

HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

image

ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.

Similar News

News September 19, 2025

సరూర్‌నగర్ చెరువులో దూకి సూసైడ్

image

సరూర్‌నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.

News September 18, 2025

అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

image

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్‌పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.

News September 18, 2025

BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

image

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.