News October 14, 2024

దివ్యాంగులు ఈ సైటులో దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం: మంత్రి సీతక్క

image

TG: దివ్యాంగుల జాబ్ పోర్టల్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇకపై దివ్యాంగులు కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరగాల్సిన అవసరం లేదని, <>పోర్టల్‌లో <<>>రిజిస్ట్రేషన్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయన్నారు. సంక్షేమ శాఖ నిధుల్లో దివ్యాంగులకు 5% కేటాయిస్తున్నామని, ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ 4% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Similar News

News October 14, 2024

ఏపీ, తెలంగాణకు గుడ్‌న్యూస్

image

AP, TGలో పలు రోడ్ల నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నల్గొండలో రూ.516 కోట్లతో 4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించనుంది. దీని ద్వారా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ మధ్య ట్రాఫిక్ సమస్య తీరనుంది. అటు APలో రూ.400 కోట్లతో 200KM మేర 13 స్టేట్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.

News October 14, 2024

పాకిస్థాన్ లక్ష్యం 111 రన్స్.. భారత్ సెమీస్ వెళ్లాలంటే ఇలా జరగాలి..

image

భారత్ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20ఓవర్లలో 110/6 స్కోర్ చేసింది. మహిళల T20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ వెళ్లాలంటే 10.4 ఓవర్ల తర్వాతే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ 10.4 ఓవర్ల లోపు టార్గెట్ ఛేదిస్తే పాకిస్థాన్ క్వాలిఫై అవుతుంది. పాక్ ఓడితే పాకిస్థాన్, ఇండియా రెండూ ఇంటి ముఖం పడతాయి. కీలకమ్యాచ్‌లో పాక్ 8క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం.

News October 14, 2024

కుంగిన రైల్వే ట్రాక్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

image

AP: గుంటూరు జిల్లా పొన్నూరు(మ) మాచవరం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో మాచవరం చేరుకున్న తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఇబ్బంది తలెత్తగా, రైలును వెనక్కి మళ్లించి 3వ రైల్వే లైన్ ద్వారా HYD పంపించారు. మాచవరంలో ట్రాక్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు.