News October 14, 2024

రేపటి నుంచి మళ్లీ ‘మూసీ’ కూల్చివేతలు.. ఇళ్ల ముందు బోర్డులు

image

TG: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలను మంగళవారం నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూసీ రివర్ బెడ్‌పై 2,116 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కాగా కూల్చివేతల పున:ప్రారంభం నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.

Similar News

News October 14, 2024

పాకిస్థాన్ లక్ష్యం 111 రన్స్.. భారత్ సెమీస్ వెళ్లాలంటే ఇలా జరగాలి..

image

భారత్ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20ఓవర్లలో 110/6 స్కోర్ చేసింది. మహిళల T20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ వెళ్లాలంటే 10.4 ఓవర్ల తర్వాతే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ 10.4 ఓవర్ల లోపు టార్గెట్ ఛేదిస్తే పాకిస్థాన్ క్వాలిఫై అవుతుంది. పాక్ ఓడితే పాకిస్థాన్, ఇండియా రెండూ ఇంటి ముఖం పడతాయి. కీలకమ్యాచ్‌లో పాక్ 8క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం.

News October 14, 2024

కుంగిన రైల్వే ట్రాక్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

image

AP: గుంటూరు జిల్లా పొన్నూరు(మ) మాచవరం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో మాచవరం చేరుకున్న తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఇబ్బంది తలెత్తగా, రైలును వెనక్కి మళ్లించి 3వ రైల్వే లైన్ ద్వారా HYD పంపించారు. మాచవరంలో ట్రాక్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టారు.

News October 14, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిల్లో ఉంటున్న విద్యార్థులను సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని సూచించారు. అటు వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.