News October 14, 2024
భద్రాచలం: గిరిజన యువతి యువకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ: పీవో

గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు బ్యూటీషియన్, టైలరింగ్, తేనెటీగల పెంపకం కోర్సులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీవో పీవో రాహుల్ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్, రేషన్ కార్డ్/ఉపాధిహామీ బుక్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్తో ఈనెల 18 లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.
Similar News
News January 1, 2026
ఖమ్మం: ఐదేళ్లుగా అసంపూర్తిగానే అగ్రహారం అండర్ బ్రిడ్జి!

ఖమ్మం-బోనకల్ రహదారిలోని అగ్రహారం వద్ద రూ.18.50 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి (RUB) పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2021లో శంకుస్థాపన చేసినా, కోవిడ్, విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పు వల్ల పనులు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News January 1, 2026
ఖమ్మం: సదరం సేవలపై సెర్ప్ సీఈవో సమీక్ష

సదరం అమలు, ధ్రువీకరణ పత్రాల జారీపై సెర్ప్ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
News January 1, 2026
ఖమ్మం: కొత్తగా ఐదు కుష్టు వ్యాధి కేసులు

ఖమ్మం జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తైనట్లు డీఎంహెచ్ఓ డా.రామారావు తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు 2.55 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించగా 1,369 మంది అనుమానితులను గుర్తించారు. తుది పరీక్షల అనంతరం 5 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.


