News October 14, 2024
గ్రూప్-1పై రేపు హైకోర్టు తీర్పు

TG: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ప్రిలిమ్స్ ఫైనల్ కీలలో తప్పులున్నాయని అభ్యర్థులు వాదించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా కీ రూపొందించినట్లు TGPSC కోర్టులో వివరణ ఇచ్చింది. దీంతో పాటు ST రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన పిటిషన్పైనా రేపు వచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News November 8, 2025
బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.
News November 8, 2025
పుజారా కెరీర్ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

హీరో షారుఖ్ ఖాన్పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.
News November 8, 2025
APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ <


