News October 14, 2024
సెప్టెంబర్లో సామాన్యుడిపై ధరల మోత
వస్తు, సేవల ధరలు ఈ ఏడాది సెప్టెంబర్లో సామాన్యుడి నడ్డివిరిచాయి. రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో గత ఏడాది Sepతో పోలిస్తే 5.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణ రేటు 5.87% వద్ద ఉంటే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 5.05%గా నమోదైంది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ద్రవ్యోల్బణం 9.24 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు 9.08%, పట్టణాల్లో 9.56% అధికమయ్యాయి.
Similar News
News October 15, 2024
BRS అనుమతిచ్చిన దాన్నే KTR వ్యతిరేకిస్తున్నారు: CMO
TG: తమ పదేళ్ల పాలనలో దామగుండం ఫారెస్ట్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము ఒప్పుకోలేదన్న KTR వ్యాఖ్యలపై CMO స్పందించింది. గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. BRS తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టుపై ఇప్పుడు KTR రాజకీయం చేస్తున్నారని వివరించింది.
News October 15, 2024
ఆలయంపై దాడితో కలవరపడ్డా: KTR
TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి తనను కలవరపాటుకు గురిచేసిందని KTR చెప్పారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్ సహనశీలతకు మచ్చ అని ఆయన స్పష్టం చేశారు. ఆలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని విమర్శించారు.
News October 14, 2024
ఎన్నికల కోసమే ట్రూడో ‘అనుమానిత’ స్టంట్
కెనడాలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జర్ హత్యను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెనడాలో ఇటీవల జీవన వ్యయాలు భారీగా పెరగడంతో స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ట్రూడో ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ప్రాబల్యం ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదుల మద్దతు కోసమే నిజ్జర్ హత్యను ట్రూడో రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.