News October 15, 2024
పవన్ కళ్యాణ్ కామెంట్స్ తొలగించాలని పిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిల్ దాఖలైంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వులు కలిశాయని వ్యాఖ్యానించారని, వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని లాయర్ రామారావు పిల్ వేశారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ (నిషేధ) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నేడు ఈ పిల్ విచారణకు రానుంది.
Similar News
News October 15, 2024
‘లుక్ అవుట్’ పేరుతో ఎయిర్పోర్టులో సజ్జల అడ్డగింత: YCP
AP: TDP ఆఫీసుపై దాడి ఘటన కేసులో సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని YCP విమర్శించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్, అప్పిరెడ్డి, తలశిల రఘరాంపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమంది. నిన్న విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న సజ్జలను ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీసు పేరుతో అడ్డుకున్నారని తెలిపింది. ఆయన విదేశాలకు వెళ్లేటప్పుడు లేని నోటీసు ఇప్పుడేంటని ప్రశ్నించింది.
News October 15, 2024
మిసైల్ మ్యాన్ స్ఫూర్తిదాయక కోట్స్!
యువతలో స్ఫూర్తినింపేందుకు APJ అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులు మీకోసం. 1. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. 2. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. 3. ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఓ మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. 4. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. 5. మన జననం సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం చరిత్ర సృష్టించేలా ఉండాలి.
News October 15, 2024
గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్లో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన ఆన్సర్లు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.