News October 15, 2024
కరెంటు వాతలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ: KTR

TG: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోందంటూ KTR విమర్శించారు. ‘కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ. 300 యూనిట్లు దాటితే కిలో వాట్కు ఫిక్స్డ్ ఛార్జీ ₹50’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. వినియోగదారులు జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త బాదుడు షురూ చేస్తారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 12, 2026
PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి: CBN

AP: నిధులు లేవని పనులు ఆపొద్దని, క్రియేటివ్గా ఆలోచించి ముందుకెళ్లాలని CBN సూచించారు. PPP పద్ధతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులు, మంత్రులతో సమీక్షలో ఆదేశించారు. ‘కేంద్ర నిధులను కొన్ని శాఖలు ఖర్చు చేయడం లేదు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు వచ్చే అవకాశమున్నా ఖర్చు చేయలేదు. నెలాఖరులోగా పూర్తి చేసి అదనపు నిధులు కోరాలి. కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవచ్చు’ అని CM పేర్కొన్నారు.
News January 12, 2026
టిమ్ కుక్ తర్వాత యాపిల్ బాస్ ఇతనేనా?

యాపిల్ CEOగా టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. 50 ఏళ్ల ఈ హార్డ్వేర్ ఎక్స్పర్ట్ 2001 నుంచే కంపెనీలో ఉన్నారు. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్పాడ్స్ వంటి హిట్ ప్రొడక్ట్స్ వెనుక ఇతని హస్తం ఉంది. కాలేజీ రోజుల్లో వర్సిటీ స్విమ్మర్ అయిన టెర్నస్ ఇప్పుడు యాపిల్ పగ్గాల కోసం రేసులో ముందున్నారు. ఆయన డీటైలింగ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ యాపిల్కు కొత్త వెలుగునిస్తాయని భావిస్తున్నారు.
News January 12, 2026
పండుగల్లో ఆఫర్ల మాయలో పడకండి

పండుగ సమయాల్లో ప్రకటించే ఆఫర్ల మాయలో పడ్డామంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కరోజు ఆనందం కోసం చూస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకోవద్దు అనే నియమాన్ని పాటించండి. వేటికెంత కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి.


