News October 15, 2024

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జికి రూ.98 కోట్లు విడుదల

image

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్మిణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సమస్యని నితిన్ గట్కరీ దృష్టికి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పలుమార్లు తీసుకెళ్లారు. ఎన్నికల అనంతరం ఫ్లైఓవర్‌పై మున్సిపల్ అధికారులతో పెమ్మసాని అనేక రివ్యూలు చేపట్టారు. ఎట్టకేలకు పెమ్మసాని చొరవతో గుంటూరు నగర ప్రజల కల త్వరలో నెరవేరనుంది.

Similar News

News January 10, 2026

GNT: మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్‌మెంట్‌పై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

News January 10, 2026

GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

image

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.

News January 10, 2026

తెనాలిలో అర్ధరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

image

తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్‌ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.