News October 15, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాకు నిమ్మల రామానాయుడు, నంద్యాలకు పయ్యావుల కేశవ్ ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.
Similar News
News December 31, 2025
ఎస్పీగా విక్రాంత్ పాటిల్ పదిలమైన ముద్ర

కర్నూలు జిల్లా ఎస్పీగా 10 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన విక్రాంత్ పాటిల్, డీఐజీగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్పై అవగాహన కల్పిస్తూ నేరాల శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. పదోన్నతి పొందిన ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 31, 2025
కర్నూలు జిల్లాలో ఏడాదిలో 658 ప్రమాదాలు

కర్నూలు జిల్లాలో గత ఏడాది కంటే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 547 ప్రమాదాలు జరగగా, 2025లో ఆ సంఖ్య 658కి చేరింది. ముఖ్యంగా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం కావడం జిల్లాను కలచివేసింది. అలాగే డిసెంబరు 2న సంతోష్నగర్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
News December 30, 2025
పెద్దహరివాణం మండలం పేరు మార్పుపై ఉద్రిక్తత

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రతరమైంది. మంగళవారం సిరుగుప్ప, ఆదోని రోడ్డుపై స్థానికులు వందలాదిమంది బైఠాయించి టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.పెద్దహరివాణం మండలంగా గత నెలలో నోటిఫికేషన్ వచ్చిందన్నారు. పెద్దహరివాణంకు బదులుగా ఆదోని మండలంను ఒకటి, రెండుగా విభజించి ప్రకటించడం తగదని ఆగ్రామంలో నాయకుడు ఆదినారాయణ రెడ్డి నిరవధిక దీక్షకు పూనుకున్నారు.


