News October 15, 2024
శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్

శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెలువడ్డాయి. గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి వర్గంలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని డా.బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. ఈ మేరకు ఆయా మంత్రులకు ఇన్ఛార్జ్ స్థానాలను కేటాయించారు.
Similar News
News January 2, 2026
రణస్థలం: ‘108 నిర్లక్ష్యం లేదు’

రణస్థలం సూర్య స్కూల్ పరిధిలో డిసెంబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం తెలిసిందే. 108 రావడం ఆలస్యం కావడంతోనే ఆ వ్యక్తి మరణించాడని స్థానికులు కొందరు తెలపడంతో Way2Newsలో అలాగే ప్రచురితమైంది. కానీ సాంకేతిక సమస్య కారణంగా 108కు కాల్ రీచ్ కాలేదు. కాసేపటికే కాల్ కనెక్ట్ కావడంతో వెంటనే ప్రమాద స్థలికి అంబులెన్స్ వెళ్ళింది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అధికారులు తెలిపారు.
News January 2, 2026
నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.
News January 2, 2026
SKLM: న్యూ ఇయర్ కిక్..రూ. 3.75 కోట్ల మద్యం తాగేశారు

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ఉదయం-రాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయాన్నారు.


