News October 15, 2024
ఈవీఎం వార్లోకి ఇజ్రాయెల్ను తెచ్చారు!

దేశంలో రగులుతున్న EVM రగడలోకి కాంగ్రెస్ ఇజ్రాయెల్ను చేర్చింది. 600Kms దూరంలోని పేజర్లను పేల్చగల ఇజ్రాయెల్ ఈవీఎంలనూ ఆపరేట్ చేయగలదని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆరోపించారు. PM మోదీకి ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయని ఉటంకించారు. ఇన్నాళ్లూ విపక్షాల ట్యాంపరింగ్ ఆరోపణలను చాలామంది రాజకీయ ప్రచారమనే భావించారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెద్దన్నను ఇందులోకి లాగడంతో ప్రజలు ఏ వాదనను అంగీకరిస్తారో చూడాలి.
Similar News
News September 17, 2025
ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. APPLY

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <
News September 17, 2025
అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదు: మోదీ

పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి భారత్లో విలీనం చేశారని చెప్పారు.
News September 17, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.