News October 15, 2024
ఈవీఎం వార్లోకి ఇజ్రాయెల్ను తెచ్చారు!
దేశంలో రగులుతున్న EVM రగడలోకి కాంగ్రెస్ ఇజ్రాయెల్ను చేర్చింది. 600Kms దూరంలోని పేజర్లను పేల్చగల ఇజ్రాయెల్ ఈవీఎంలనూ ఆపరేట్ చేయగలదని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆరోపించారు. PM మోదీకి ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయని ఉటంకించారు. ఇన్నాళ్లూ విపక్షాల ట్యాంపరింగ్ ఆరోపణలను చాలామంది రాజకీయ ప్రచారమనే భావించారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెద్దన్నను ఇందులోకి లాగడంతో ప్రజలు ఏ వాదనను అంగీకరిస్తారో చూడాలి.
Similar News
News October 15, 2024
DOPT ఉత్తర్వులు పాటించాల్సిందే.. క్యాట్ తీర్పు
తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు వేసిన పిటిషన్పై CAT కీలక తీర్పునిచ్చింది. వారు ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. రేపు యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వాకాటి అరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.
News October 15, 2024
స్నేహితుడి హత్య.. సల్మాన్కు భద్రత పెంపు
రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.
News October 15, 2024
ప్రజలకు సేవ చేయాలని లేదా?: IASలకు CAT ప్రశ్న
తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు CATలో కోరారు. తాము తెలంగాణలోనే ఉంటామని IASలు ఆమ్రపాలి, కరుణ, వాణిప్రసాద్ CATలో వాదించారు. దీంతో ఏపీలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారని, అలాంటి చోటకు వెళ్లి సేవ చేయాలని లేదా అని IASలను క్యాట్ ప్రశ్నించింది. ప్రస్తుతం DOPT వాదనలను క్యాట్ వింటోంది.