News October 15, 2024

అమెరికాతో భార‌త్‌ కీల‌క ఒప్పందం

image

స‌రిహ‌ద్దుల్లో నిఘా వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌త‌కు అమెరికా నుంచి 31 ప్రిడేట‌ర్ MQ-9B డ్రోన్ల కొనుగోలుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు ఇరు దేశాలు ఒప్పందంపై మంగ‌ళ‌వారం సంత‌కాలు చేశాయి. గ‌త నెల అమెరికా ప‌ర్య‌ట‌నలో ఆ దేశాధ్య‌క్షుడు బైడెన్‌తో ప్ర‌ధాని మోదీ ఇదే విష‌య‌మై చ‌ర్చించారు. డ్రోన్ల కొనుగోలు స‌హా నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌తుల వ్యవ‌స్థ ఏర్పాటుకు ఒప్పందాలు జ‌రిగాయి. ఈ ఒప్పందం విలువ రూ.34,500 కోట్లు.

Similar News

News October 15, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?

image

దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.

News October 15, 2024

కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు

image

కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.

News October 15, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.