News October 15, 2024

ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

image

ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.

Similar News

News December 29, 2025

క్యాబినెట్ సమావేశం ప్రారంభం..

image

AP: సీఎం CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 20 అజెండాలపై చర్చించనుంది.
*అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణాలు
*అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ
*ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖ అనుమతికి ఆమోదం
*గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్
*జిల్లా కోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు

News December 29, 2025

ఈ మెడిసిన్ కొంటున్నారా?

image

అనారోగ్యానికి గురైన సమయంలో తీసుకునే కొన్ని ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఉండే ఎర్రటి గీతను ఎప్పుడైనా గమనించారా? రెడ్‌లైన్ ఉంటే వైద్యుడి సలహా లేకుండా వినియోగించకూడదని కేంద్రం చెబుతోంది. యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌‌కు దారితీస్తుందని హెచ్చరించింది. ఇలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. మెడిసిన్ కొనే సమయంలో గడువు తేదీతో పాటు రెడ్ లైన్‌ను గమనించండి.

News December 29, 2025

రాష్ట్రంలో 66 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>తెలంగాణ <<>>రాష్ట్రంలో 66 సివిల్ జడ్జీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్(CBT) FEBలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1250, EWS, PwBD, SC, STలకు రూ.600. వెబ్‌సైట్: tshc.gov.in