News October 15, 2024
తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరీని ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్కను మహారాష్ట్రలోని మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర రీజియన్లకు పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News January 28, 2026
ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలకు నష్టం లేదు: అనిల్ రావిపూడి

సినిమా రిజల్ట్పై ఫ్యాన్ వార్స్ ప్రభావం ఏమాత్రం ఉండదని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఓ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల అభిమానులు నెగటివ్ ప్రచారం చేయడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఏం చేసినా ఫ్యాన్ వార్స్ ఆగవు. కానీ వాటి వల్ల సినిమాకి వచ్చే రెవెన్యూలో అర్ధ రూపాయి కూడా తగ్గదు’ అని అభిప్రాయపడ్డారు. మూవీ బాగుంటే ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ ఆదరిస్తారని పేర్కొన్నారు.
News January 28, 2026
జనవరి 28: చరిత్రలో ఈరోజు

1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం (ఫొటోలో)
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1929: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం
1950: భారత సుప్రీంకోర్టు ప్రారంభం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: నటుడు, దర్శకుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్రావు మరణం
News January 28, 2026
జలుబుతో గొంతు బొంగురుపోయిందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

జలుబు తర్వాత గొంతు బొంగురుపోవడం లేదా వాయిస్ పడిపోవడం లారింజైటిస్ వల్ల జరుగుతుంది. ఇన్ఫెక్షన్ కారణంగా వోకల్ కార్డ్స్ వాపునకు గురవడమే దీనికి కారణం. త్వరగా కోలుకోవాలంటే మాట్లాడకుండా గొంతుకు రెస్ట్ ఇవ్వాలి. తరచూ గోరువెచ్చని నీళ్లు తాగుతూ గొంతును తడి చేసుకోవాలి. ఉప్పు నీళ్లతో పుక్కిలించడం, తేనె తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్, కారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.


