News October 15, 2024

మద్యంలో జగన్ రూ.40వేల కోట్ల దోపిడీ: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రంలోని వ్యవస్థలను YS జగన్ నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మద్యంలో రూ.40వేల కోట్లు దోచుకున్నారని, ఇసుకలోనూ ఇలాగే కొల్లగొట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీ వల్ల దరఖాస్తుల ద్వారానే రూ.1,800కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రేపు ఇసుక రీచ్‌లు మొదలవుతాయని, పది రోజుల్లో సమస్య తీరుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 11, 2025

ఢిల్లీ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్

image

IPLలో అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఆ జట్టులో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ పంజాబ్ కింగ్స్ 2, లక్నోకు 3 సీజన్లలో సారథ్యం వహించారు. ఇక అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా ఢిల్లీకి చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నారు. వీరిద్దరిలో మీ ఛాయిస్ ఎవరు? కామెంట్ చేయండి.

News March 11, 2025

R5 జోన్‌ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

image

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.

News March 11, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

error: Content is protected !!