News October 16, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: దామగుండంలో రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్
* గురుకులాలను వెంటనే తెరవకపోతే చట్టపరమైన చర్యలు: మంత్రి పొన్నం
* గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
* ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల ప్రకటన
* కూటమి ప్రభుత్వం మూడేళ్లే ఉంటుంది: కాకాణి
* వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక: AICC
* మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్‌లో NOV 13, 20వ తేదీల్లో పోలింగ్

Similar News

News February 9, 2026

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

image

AP: డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీ నిధి’ పథకాన్ని డిజిటల్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న రూ.5 లక్షల లోన్‌ను రూ.8 లక్షలకు పెంచింది.

News February 9, 2026

పూజా మందిరంలో దీపం పెడుతున్నారా?

image

నిత్య దీపారాధనతో ఇంట్లో శుభం కలుగుతుంది. అయితే కొన్ని నియమాలతో మరిన్ని పుణ్యఫలాలు లభిస్తాయి. అవి.. దీపాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. తూర్పు వైపు పెడితే ఆరోగ్యం, ఉత్తరం వైపు పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తాయి. శివునికి ఎడమ, విష్ణువుకు కుడి వైపు దీపం ఉంచాలి. ఇందుకు ఆవు నెయ్యి శ్రేష్ఠం. ఒకే వత్తితో దీపం వెలిగించరాదు. కాలిన వత్తితో ఓ పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News February 9, 2026

పెరిగిన ఎండలు..

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. TGలోని ప్రధాన నగరాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీలు, హనుమకొండ, మెదక్, నిజామాబాద్‌లో 32 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొంది. అటు ఏపీలోని కావలిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా రికార్డైంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.