News October 16, 2024

సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తా: మంత్రి సుభాశ్

image

తనపై నమ్మకం ఉంచి కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, మంత్రి లోకేశ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనపై పెట్టిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Similar News

News January 14, 2026

అధిక చార్జీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు: తూ.గో RTO

image

సంక్రాంతి వేళ ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ మంగళవారం హెచ్చరించారు. RTC ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

News January 13, 2026

NMMS విద్యార్థులకు అలెర్ట్.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

image

డిసెంబర్ 7న NMMS పరీక్ష రాసిన విద్యార్థులు కుల, ఆదాయ, 7వ తరగతి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20లోపు సిద్ధం చేసుకోవాలని DEO వాసుదేవరావు మంగళవారం సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు గడువులోగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే స్కాలర్‌షిప్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

News January 13, 2026

RJY: మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీ

image

వరకట్న నిషేధ చట్టం-1961 అమలుపై అవగాహన పెంచాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఈ చట్టం అమలు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. వరకట్న దురాచారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.