News October 16, 2024

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

image

శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News October 16, 2024

‘మేడిన్ ఇండియా’ బుల్లెట్ ట్రైన్ నిర్మించేది ఇక్కడే

image

‘మేడిన్ ఇండియా’ తొలి బుల్లెట్ ట్రైన్లను రూపొందించే అవకాశం బెంగళూరులోని BEMLకు దక్కింది. డిజైనింగ్, తయారీ, 2 హైస్పీడ్ ట్రైన్ సెట్స్ కోసం కంపెనీకి ICF రూ.867 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కోచ్ ధర రూ.27.86 కోట్లు. ‘భారత హైస్పీడ్ రైల్ జర్నీలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయి. 280 KMPH స్పీడ్‌తో ట్రైన్ సెట్లను దేశీయంగా డిజైన్ చేయబోతున్నాం’ అని BEML తెలిపింది. 2026 ఆఖర్లో వీటిని డెలివరీ చేస్తుందని సమాచారం.

News October 16, 2024

గిల్‌తో ఓపెనింగ్ చేయించొద్దు: అనిల్ కుంబ్లే

image

నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు అనిల్ కుంబ్లే కీలక సూచన చేశారు. రోహిత్ స్థానంలో గిల్‌తో ఓపెనింగ్ చేయించవద్దని, అతడిని మూడో స్థానంలోనే కొనసాగించాలని అన్నారు. జైస్వాల్‌కు ఓపెనింగ్ జోడీగా KL రాహుల్‌ను పంపిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడగలరని, గిల్ పొజిషన్‌ను ఛేంజ్ చేయడం అవసరం లేదన్నారు.

News October 16, 2024

అందుకే రేస్ కార్ల జోలికి వెళ్లట్లేదు: నాగచైతన్య

image

తనకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టమని హీరో నాగచైతన్య చెప్పారు. కొత్త రకం బైక్, కారు ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేసేవాడినని తెలిపారు. సినిమాలతో బిజీగా మారడంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వేగంగా వెళ్లొద్దని సన్నిహితులు సూచించడంతో రేసింగ్‌కు దూరమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు.