News October 16, 2024
17న నీతి అయోగ్ సీఈవో విశాఖ రాక

ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి బస చేస్తారు. 18వ తేదీన సీఈవో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 11.10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళతారు.
Similar News
News July 6, 2025
‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 2

➦ అనకాపల్లి నుంచి సిటీ వైపు వచ్చే భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్బవరం మీదుగా ప్రయాణం చేయాలి.
➦09 తేదీ ఉదయం 6 నుంచి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య వాహనాలకు నో ఎంట్రీ. దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించాలి
➦అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనాలు విశాఖ సిటీలోకి అనుమతి లేదు. లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.
News July 6, 2025
గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ రూల్స్-3

➥ శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చే ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➥ గిరిప్రదక్షిణకు వచ్చు భక్తుల రద్దీ దృష్ట్యా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ జంక్షన్ నుంచి కురుపాం బీచ్ రోడ్ జంక్షన్ వరకు వాహనములు అనుమతించరు.
➥హనుమంతువాక జంక్షన్, వెంకోజీపాలెం జంక్షన్ వద్ద భక్తుల రద్దీ ఉంటుంది.