News October 16, 2024
పలాస: టీడీపీ సానుభూతిపరులపై దాడి
పలాస నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులపై దాడి జరగ్గా పలువురు గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామానికి చెందిన గంగయ్య గతంలో టీడీపీ కోసం పనిచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు గంగయ్యతో పాటు ఆయన భార్యపై దాడి చేశారు. అడ్డుకున్న కుమారుడు గిరిపై కూడా దాడి చేయడంతో గాయపడ్డారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 16, 2024
శ్రీకాకుళం: ‘3,071 పనులకు రూ.261 కోట్లు మంజూరు’
సారవకోట మండలం అర్లి గ్రామం నుంచి గోవర్థనపురం గ్రామానికి బీటీ, సీసీ రోడ్డు పనులకు బగ్గు రమణమూర్తితో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..పల్లె పండుగ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఇప్పటివరకు రూ.261 కోట్లతో 3,071 పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మరిన్ని పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆర్డీవో కృష్ణమూర్తి, ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 16, 2024
25న శ్రీకాకుళంలో జాబ్ మేళా
శ్రీకాకుళంలోని గవర్నమెంట్ DLTC కాలేజీలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ N.శేషగిరి తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, పూర్తి చేసి 18-24 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 16, 2024
LLB పరీక్ష టైం టేబుల్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.