News October 16, 2024

NLG: కొలువు తీరనున్న కొత్త ఉపాధ్యాయులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీఎస్సీ 2024 సెలక్టెడ్ అభ్యర్థుల స్కూల్ అలాట్మెంట్ కౌన్సెలింగ్ మంగళవారం రాత్రి వరకు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 324 మంది ఉపాధ్యాయులు స్కూల్ జాయినింగ్ అలాట్మెంట్ ఆర్డర్లను పొందారు. డీఈవో అశోక్ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ముగిసినట్లు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News January 14, 2026

నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

నల్గొండ ఇక కార్పొరేషన్… గెజిట్ విడుదల
మాడుగులపల్లి: చైనా మాంజా నుంచి సేఫ్.. ఐడియా అదిరింది
నల్గొండ: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
నల్గొండ: భోగి మంటల్లో జీవో ప్రతులు దగ్ధం
కట్టంగూరు: పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు
మిర్యాలగూడ: జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి
కట్టంగూరు: ఘనంగా గోదారంగనాథ స్వామి కళ్యాణం
దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన

News January 14, 2026

NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

image

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 14, 2026

నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.