News October 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} మధిరలో కొనసాగుతున్న పశువుల గాలి కుంట టీకాలు
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన

Similar News

News October 16, 2024

ఎవరి హయాంలో ఖమ్మం అభివృద్ధి..?

image

తెలంగాణ రాజకీయంలో ఖమ్మం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ నుంచి గెలిచిన వారు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. పువ్వాడ నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్ గెలిచి నియోజకవర్గ అభివృద్ధిపై తమ మార్క్ వేశారు. అయితే ఖమ్మం నుంచి గతంలో పువ్వాడ మంత్రవగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల నాగేశ్వర్ రావు కూడా మంత్రిగా ఉన్నారు. వీరిలో ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందో కామెంట్ చేయండి.

News October 16, 2024

సన్నబియ్యానికి రూ.500 బోనస్ ఇస్తాం: మంత్రి తుమ్మల

image

నల్గొండ ఎస్ఎల్‌బీసీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తుమ్మల చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News October 16, 2024

చిరుత పులి సంచరిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి: సీఐ ఇంద్రసేనారెడ్డి

image

ఏన్కూర్, జూలూరుపాడు మండల ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారని సీఐ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. చిరుత కనబడితే తమకు సమాచారం అందించాలని కోరారు.