News October 16, 2024
నంద్యాల జిల్లాలో నేడు సెలవు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.
Similar News
News January 13, 2026
రైతులకు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రైతులు పంట సాగులో ఎదుర్కొంటున్న పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. ఖరీఫ్ 2026, రబీ 2026-27 పంటలకు కూలీ ఖర్చులు, పెట్టుబడులు, గతేడాది ధరలను పరిగణలోకి తీసుకొని రుణ పరిమితులు నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 13, 2026
ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
కర్నూలు: 95 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద నిర్వహించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, మెగా కీలు అందజేశారు. టిడ్కో గృహాలకు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఫిబ్రవరిలో మరో 500 గృహాలు అందజేస్తామన్నారు.


