News October 16, 2024

ఐఏఎస్‌లకు హైకోర్టు షాక్

image

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లకు షాక్ తగిలింది. ఇలాంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని జడ్జి వ్యాఖ్యానించారు. ముందుగా వెళ్లి ఏపీలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించారు. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ తీర్పునివ్వడంతో ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, కరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 16, 2024

సుభాష్ చంద్రబోస్ అన్న కుమార్తె కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న శరత్ చంద్ర బోస్ కుమార్తె రోమా రే(95) స్వర్గస్థులయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని వారి నివాసంలో వృద్ధాప్య కారణాలతో ఆమె కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. రోమాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. స్వాతంత్ర్య సమరంలో నేతాజీ పోరాటానికి రోమా ప్రత్యక్ష సాక్షి. ఆయన భార్య ఎమిలీ షెంకిల్‌తోనూ రోమాకు స్నేహం ఉంది.

News October 16, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు సెలవు ఉండనుంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News October 16, 2024

రాష్ట్రంలో ఈ రోడ్లకు మహర్దశ

image

APలో పలు రహదారులను కేంద్రం అభివృద్ధి చేయనుంది. కొండమోడు-పేరేచర్ల మధ్య 49.91K.M దూరాన్ని రూ.883.61కోట్లతో 4 లేన్లుగా అభివృద్ధి చేయనుంది. సత్తెనపల్లి, మేడికొండూరులో బైపాస్‌లు నిర్మించనుండడంతో, HYD-గుంటూరు మధ్య రాకపోకలకు సులువు అవుతుంది. సంగమేశ్వరం-నల్లకాలువ, వెలుగోడు-నంద్యాల మధ్య 62.571K.Mను రూ.601.14 కోట్లతో, నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దుల మధ్య 62.01K.M దూరాన్ని ₹691.81 కోట్లతో అభివృద్ధి చేయనుంది.