News October 17, 2024
లెబనాన్పై భీకర దాడులు.. మేయర్ మృతి
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఖనా నగరంపై జరిపిన ఎయిర్ స్ట్రైక్లో నబాతియే మేయర్ అహ్మద్ కహిల్ మరణించారు. ఆయనతో సహా 15 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 250 మంది మిలిటెంట్లు మరణించారు. తమ సరిహద్దుల్లో హెజ్బొల్లాను తరిమికొట్టేంత వరకు కాల్పుల విరమణ చేపట్టమని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తేల్చిచెప్పారు.
Similar News
News October 17, 2024
సానియా మీర్జా మళ్లీ పెళ్లి.. నిజమెంత?
పాక్ మాజీ క్రికెటర్ మాలిక్ నుంచి విడాకులు తీసుకున్న సానియా మీర్జా మరోసారి పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సనా జావేద్ అనే నటిని మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె మాజీ భర్త ఉమైర్ జస్వాల్కు తాజాగా వివాహం కాగా, అతడు పెళ్లాడింది సానియానేనంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే, సానియా పిల్లలతో కలిసి దుబాయ్లో ఉన్నారని.. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
News October 17, 2024
VIPలకు NSG భద్రత కట్
దేశంలోని వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరి భద్రతను సీఆర్పీఎఫ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్నాథ్ సింగ్, మాయావతి, సర్బానంద సోనోవాల్, అజాద్, ఫరూక్ అబ్దుల్లాకు భద్రత ఉపసంహరించనున్నారు. వీరి సెక్యూరిటీని CRPF చూసుకుంటుంది.
News October 17, 2024
బాహుబలి-3 రానుందా?
బాహుబలి, బాహుబలి-2 సినిమాలు చరిత్ర సృష్టించాయి. వాటికి మరో సీక్వెల్ రాకపోవచ్చని జక్కన్న రాజమౌళి పలుమార్లు చెప్పారు. అయితే, కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాహుబలి నిర్మాతలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు బాహుబలి-3 తీయనున్నట్లు అన్నారని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్గా మారింది. బాహుబలి సిరీస్లను తమిళంలో జ్ఞానవేలే సమర్పించారు.