News October 17, 2024
సముద్ర తీరాన్ని పరిశీలించిన నెల్లూరు కలెక్టర్, ఎస్పీ

ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్రతీరాన్ని బుధవారం కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. వర్షాలు పూర్తిగా తగ్గేవరకు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News July 4, 2025
20 బైకులను ప్రారంభించిన SP

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.
News May 8, 2025
హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్.. తీర్పు వాయిదా

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో ఊరట దక్కలేదు. పొదలకూరు(మ) వరదాపురంలో అక్రమ మైనింగ్కు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి వేసిన పిటీషన్పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు.. తీర్పును జూన్ 16కు వాయిదా వేసింది. కాకాణి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
News May 8, 2025
నుడా వీసీగా జేసీ కార్తీక్

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్(నుడా) వైస్ ఛైర్మన్గా జాయింట్ కలెక్టర్ కార్తీక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వీసీగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ పనిచేశారు. ఆయన ఇటీవలే బదిలీ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జేసీని నుడా వైస్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది.