News October 17, 2024

VIPలకు NSG భద్రత కట్

image

దేశంలోని వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరి భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి, సర్బానంద సోనోవాల్, అజాద్, ఫరూక్ అబ్దుల్లాకు భద్రత ఉపసంహరించనున్నారు. వీరి సెక్యూరిటీని CRPF చూసుకుంటుంది.

Similar News

News October 17, 2024

IPL: పంజాబ్ రిటెన్షన్ ఒక్కడే!

image

పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడినే రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా వేలంలో పొరపాటున కొన్న శశాంక్ సింగ్‌ను అట్టిపెట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా పంజాబ్ మొదటి నుంచీ రిటెన్షన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు అందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే నాణ్యమైన ఆటగాళ్లు అన్ని జట్లకు దొరుకుతారని వాదిస్తోంది. కానీ ఆ జట్టు అభ్యర్థనను BCCI అంత సీరియస్‌గా తీసుకోలేదు.

News October 17, 2024

అమరావతిలో రూ.49వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు: నారాయణ

image

AP: అమరావతి పనులను 20 రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రూ.49వేల కోట్ల విలువైన పనులకు జనవరిలోగా టెండర్లు పిలుస్తామన్నారు. మౌలిక వసతులు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, HODల కార్యాలయాల నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. MLAలు, MLCలు, IASల భవనాల నిర్మాణానికి రూ.524 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. 2 నెలల్లో వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.

News October 17, 2024

నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

image

AP: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో సెలవు మంజూరు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లు హాలిడే ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.