News October 17, 2024
నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
AP: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో సెలవు మంజూరు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లు హాలిడే ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 17, 2024
తెలంగాణ పత్తి రైతులపై ఎందుకీ వివక్ష?: హరీశ్ రావు
TG: గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి ₹7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదు. ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంది?’ అని Xలో నిలదీశారు.
News October 17, 2024
పుష్ప-2 నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప-2 రిలీజ్(డిసెంబర్ 6)కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీరియస్గా కుర్చీలో కూర్చొన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
News October 17, 2024
జంక్ ఫుడ్తో డిప్రెషన్
జంక్ ఫుడ్తో ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అలాంటి ఆహారం వల్ల డిప్రెషన్ కూడా పెరుగుతుందని తాజాగా మానసిక వైద్యుడు డేనియల్ అమెన్(US) వెల్లడించారు. ఇప్పటికే ఒత్తిడితో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్ను వెంటనే మానేయాలని సూచిస్తున్నారు. శరీరంలోని మైక్రోబయోమ్ మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.